సిపిఐ నిర్మల్ జిల్లా కార్యవర్గ సమావేశం నేడు జరిగింది. నిర్మల్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి G.S.నారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి విలాస్ మాట్లాడుతూ ఈ నెల 22 నుండి 24 వరకు మంచిర్యాల్ లో జరిగే CPI రాష్ట్ర నిర్మాణ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలలో 33 జిల్లాల నుండి వెయ్యి మంది ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు.
ఈ సందర్భముగా CPI మహాసభ గోడ ప్రతులను విడుదల చేసారు. భారత కమ్యూనిస్టు పార్టీ కాన్పూర్ లో డిసెంబర్ 25 న స్థాపించారని, సమ సమాజ స్థాపన దేశ స్వాతంత్య్రం కొరకు ఉద్యమించిందని అన్నారు. కార్మిక, కర్షక, దళిత, బహుజనుల, మహిళ, యువజన, విద్యార్థి సమస్యల మీద పలు పోరాటాలు నిర్వహించిందని ఆయన తెలిపారు.
ప్రస్తుత కుల, మత విభజన రాజకీయ పరిస్థితులలో భారత కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహాసభలకు ప్రతినిధులుగా S.విలాస్, G.S.నారాయణ లను పంపాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, పద్మకుమారి, G.S.నారాయణ, A.C.లక్ష్మణ్, జాదవ్ శంకర్ పాల్గొన్నారు.