కడప జిల్లా రాజంపేట లో శుక్రవారం వామపక్షాల నిరసన నిర్వహించారు. అఖిలభారత రైతు సంఘాలు పిలుపులో భాగంగా దేశవ్యాప్త బంద్ లో భాగంగా ఆర్ అండ్ బి బంగాళా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నిరసన చేపట్టారు.
వ్యవసాయ బిల్లు చట్ట రూపం దాలిస్తే రైతులకు తీవ్ర నష్టం అని సీపీఐ, సీపీఎం,అనుబంధ సంఘాలు ఆరోపించాయి. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లు ప్రకటించగానే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దానికి మద్దతు ప్రకటించడం, అదే విధముగా టీడీపీ కూడా మద్దతు తెలపడం దొందు దొందే అని విమర్శించారు.
ఈ బిల్లు రైతు సంక్షేమం కోసం వారి ఉరి తాళ్ళు కు అని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ,సీపీఎం అనుబంధ సంఘాల నేతలు మహేష్ ,చిట్వేల్ రవి,రాయుడు, నరసింహా తదితరులు పాల్గొన్నారు.