మల్కాజిగిరిలో దారుణం జరిగింది. ఆనంద్ బాగ్ లోని వెంకట్ ప్లాజా అపార్టుమెంట్ లో కారు రివర్స్ తీస్తుండగా జరిగిన ప్రమాదంలో మూడు సంవత్సరాల బాలుడు మరణించాడు. కారు చక్రాల కింద పడి బాలుడు మరణించడం దిగ్భ్రాంతి కలిగించింది. పోలీసులు బాలుడి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మల్కాజ్ గిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
previous post
next post