తెలంగాణ ఉద్యమకారుడు,ఉద్యోగ సంఘాల నాయకుడు,శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రిగా రాణిస్తున్న బలహీన వర్గాల నాయకుడు రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి విరసనోళ్ళ శ్రీనివాస్ గౌడ్ రాజకియ ఎదుగుదలను ఓర్వలేకనే కొందరు కుట్రలు చేస్తున్నారని మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్,పట్టణ కల్లుగీతకార్మిక సొసైటి అధ్యక్షుడు వల్లపుదాసు కృష్ణ గౌడ్ అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కౌండిన్య గార్డెన్స్ లో గురువారం జరిగిన సమావేశంలో గౌడ సంఘం నాయకులతో కలిసి వారు మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై జరిగిన హత్యా కుట్రలను ఖండించారు. గౌడ నాయకులపై దాడులకు,కుట్రలకు పాల్పడితే సహించేది లేదని అన్నారు. బలహీనవర్గాలకు చెందిన మంత్రిపై కుట్రలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.కుట్ర వెనక దాగిఉన్న అజ్ఞాత శక్తులను కనిపెట్టే పోలీసులు విచారణ చేపట్టాలని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈ సమావేశంలో గౌడ సంఘం నాయకులు బెల్లంకొండ చిరంజీవి గౌడ్,తండు సాయిరాం గౌడ్,తండు ఉపేందర్ గౌడ్,బెల్లంకొండ అమర్ గౌడ్,పండ్ల హుస్సేన్ గౌడ్,కోల శ్రీనివాస్ గౌడ్,పులి గోవింద్ గౌడ్,కుక్కడపు నర్సింహారావు గౌడ్,తండు వెంకన్న గౌడ్,బెల్లంకొండ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్