రాష్ట్ర వ్యాప్తంగా 18 గంటల పాటు కర్ఫ్యూ విధించారు.. ఏపీ పోలీసులు. కరోనా కట్టడికి అటు రెవెన్యూ, ఇటు పోలీసు శాఖ లు సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 8 గంటల నుంచీ 11.30 వరకూ కర్ఫ్యూకు సడలింపు ఇచ్చారు కూడా.అయితే కర్ఫ్యూ సమయంలో వైద్య ఆరోగ్య శాఖ లో పని చేసే ఓ మహిళా ఉద్యోగి…తన స్నేహితురాలితో విజయనగరం రోడ్లపై అదీ గంటస్థంభం నుంచీ మూడులాంతర్ల వరకూ బండిపై చక్కర్లు కొట్టడం పోలీసు కంట పడింది. ఆదే సమయంలో అక్కడే ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు,టూటౌన్ సీఐ శ్రీనివాసరావు లు ఉన్నారు. ఇద్దరు మహిళలు వెళుతున్న బైక్ ను ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపి..కర్ఫ్యూ సమయంలో రోడ్లపైకి తిరగడమేంటని ప్రశ్నించడంతో.. ఏటీఎం పిన్ బ్లాక్ అయిపోయింది..అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పడం ప్రారంభించారు. సీఐ వచ్చి గుచ్చి గుచ్చి అడగడం తో మేము ఉద్యోగుల అంటూ మా అన్నయ్య.. ఎస్ఐ అంటూ కబుర్లు చెప్పి దాదాపు అరగంట సీఐతో వాదించారు. అయితే ఒక మహిళ ఉద్యోగి అ ని చెప్పడం మరో మహిళ మాటలు సంబంధం లేకపోవడంతో కర్ఫ్యూ సమయంలో తిరగడంతో 700 ఫైన్ వేసి…వదిలేసారు…పోలీసులు. ఇదండీ కర్ఫ్యూ సమయంలో విజయనగరం జిల్లా కేంద్రంలో జరుగుతున్న తీరు…అని అంటోంది… సత్యం న్యూస్. నెట్.
previous post