నిజమైన నిరుపేద దళితులకు అందాల్సిన దళిత బంధువు పథకం నేడు టీఆర్ఎస్ పార్టీలో దళిత ధనవంతులకు చేరుతుందని నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవు రాజు అన్నారు. గురువారం వారు పెంట్లవెల్లి మండల తాహాసిల్దార్ రమేష్ నాయక్ కు పలు డిమాండ్లతో వినతి పత్రం అందజేశారు.
దళితులు ఆర్థిక అభివృద్ధి కోసం తీసుకువచ్చిన దళిత బంధు పథకాన్ని మంత్రులు, ఎమ్మెల్యేల జోక్యంతో టిఆర్ఎస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు మాత్రమే అవకాశాలు కల్పించడం జరిగిందనీ తెలిపారు. దళిత నిరుపేద కుటుంబాలకు అన్యాయం జరగకుండా లబ్ధిదారుల ఎంపిక బాధ్యత జిల్లా కలెక్టర్ లకు అప్పగించాలనీ అన్నారు. మండల తాహాసిల్దార్ లకు పూర్తి అధికారాలు ఇచ్చి గ్రామాలలో దండోర వేయించి గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని వినతి పత్రంలో చేర్చారు.
లేనియెడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామగ్రామాన దళితులను చైతన్యపరిచి ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం గఫార్, పార్టీ నాయకులు బోడ చెన్నకేశవులు,మరికంటి శివకేశవ్,అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.