39.2 C
Hyderabad
April 30, 2024 20: 33 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ లో దళిత కుటుంబంలో ప్రతి ఒకరికి 10 లక్షలు ఇవ్వాలి

#kollapur

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో  దళిత కుటుంబంలోని ప్రతి ఒకరికి  దళిత బంధు ద్వారా 10 లక్షలు రూపాయలు ఇవ్వాలని నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం కొల్లాపూర్ తాలూకా  బ్లాక్  కాంగ్రెస్ అధ్యక్షుడు రాము యాదవ్ అధ్యక్షతన పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు కొల్లాపూర్ నియోజక వర్గం లో దళిత బంధును అమలు చేయాలని ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి   జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ, కొల్లాపూర్ కోఆర్డినేటర్ దండెం రామ్ రెడ్డి,టి పీసీసీ కార్యదర్శి లోంక హర్షవర్ధన్ రెడ్డి, రంగినేని జగదీశ్వర్  హాజరయ్యారు. కొల్లాపూర్ నియోజక వర్గంలో దళిత బంధును అమలు చేయాలని వెంటనే కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా గిరిజన బంధువును కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల టిఆర్ఎస్ ప్రభుత్వం పై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని వంశీకృష్ణ  పిలుపునిచ్చారు.

అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని  తాహాసిల్దార్ కు  అందచేశారు.ఈ కార్యక్రమంలో  పెంట్ల వెళ్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గోవు రాజు, చిన్నంబాయి మండల ప్రెసిడెంట్ శేఖర్ యాదవ్, మధుసూదన్ రెడ్డి, కృష్ణ, నరసింహ యాదవ్, వీరన్న, కొల్లాపూర్ యువజన సంఘం అధ్యక్షుడు ఉదయ్, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Related posts

పేదవారికి 5 లక్షల కోడిగుడ్లు ఇవ్వనున్న శ్రీనివాస హేచరీస్

Satyam NEWS

ప్రత్యక్ష తరగతులకు దూరమైన విద్యార్థులకు త్రీ ఆర్స్ ఎంతో ఉపయోగం

Satyam NEWS

నో కంప్రమైస్: వ్యతిరేకించేవారంతా దళిత పేదల వ్యతిరేకులే

Satyam NEWS

Leave a Comment