దళిత బంధు పథకాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని సూర్యాపేట బిజెపి పార్టీ అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా భాగ్యరెడ్డి మాట్లాడుతూ హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారానికి వెళ్ళే టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ప్రతి ఒక్కరూ తమ నియోజకవర్గాలలో ఉన్న దళితులు అందరికీ దళిత బంధు పథకం ద్వారా 10లక్షల రూపాయలు ఇప్పించిన తరువాతే హుజురాబాద్ లో ఉపఎన్నికల ప్రచారంలోకి వెళ్ళాలని బొబ్బ భాగ్యరెడ్డి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్