30.2 C
Hyderabad
February 9, 2025 20: 44 PM
Slider ముఖ్యంశాలు

ఫైనల్ జడ్డిమెంట్: విడాకుల కేసుకు ఉరికి సంబంధం లేదు

nirbhaya case final

నిర్భయ దోషులకు ఆఖరి నిమిషంలో కూడా ఉరి శిక్ష ను వాయిదా వేయించాలని ప్రయత్నం చేసిన వారికి నిరాశే ఎదురైంది. నిర్భయ దోషులలో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ పై అతడి భార్య విడాకుల పిటీషన్ దాఖలు చేసింది. భార్య విడాకుల పిటిషన్ పెండింగులో ఉన్నందున అతడికి ఉరి అమలు చేయడం సరి కాదని వాదిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది.

విడాకుల కేసు ఉరి శిక్ష అమలు చేయడానికి అడ్డంకి కాదని, దానికి దీనికి సంబంధం లేదని జస్టిస్‌ మన్మోహన్‌ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. తర్వాత వారి పిటిషన్ ను డిస్మిస్ చేశారు. గురువారం సాయంత్రం ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. పిటిషన్‌ పై అత్యవసరంగా విచారణ జరిపారు. చివరకు కేసు కొట్టేయండంతో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరి ఖరారు అయింది.

Related posts

అనారోగ్యాల నుంచి గిరిజన చెంచు జాతిని కాపాడాలి

Satyam NEWS

బాలా త్రిపుర సుందరిగా కనకదుర్గమ్మ

Satyam NEWS

థర్డ్ రూట్:ఇండోర్‌ వారణాశి మార్గంలో మరో ప్రైవేటు రైలు

Satyam NEWS

Leave a Comment