కర్నూలు జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో సహస్ర దీపాలంకరణ వైభవంగా జరిగింది. శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారు వెండి రథంపై విహరించారు. సోమవారం సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ చేసి వెండి రథోత్సవం నిర్వహించారు. శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజల ను అర్చకులు నిర్వహించారు ఈ పూజ కార్యక్రమంలో ఈఓ లవన్న పాల్గొన్నారు. అనంతరం ఉత్సవమూర్తులను వెండి రథంపై అధిరోహింప జేసి ఆలయ ప్రదక్షిణలు చేశారు.
next post