32.7 C
Hyderabad
April 27, 2024 00: 14 AM
Slider చిత్తూరు

కులాలకతీతంగా కలసికట్టుగా వైకాపాను తరిమికొడదాం..

#tirupati

రాజ్యాంగాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని  అవమానించే విధంగా గత ఎంపీ బై ఎలక్షన్ నుండి నేటి ఎమ్మెల్సీ ఎలక్షన్ వరకు బస్సులలో దొంగ ఓటర్లను తీసుకువచ్చి..  అరాచక పాలన కొనసాగిస్తున్న..  వైకాపా ప్రభుత్వం భారత దేశ రాజ్యాంగాన్ని అవమానించే విధంగా ఆంధ్రప్రదేశ్లో అక్రమ రాజకీయాన్ని నడుపుతున్నారని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు.

తిరుపతి పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి , ఉపాధ్యక్షులు బాబ్జి , కృష్ణయ్య , రాజేష్ ఆచారి , సాయిదేవ్ యాదవ్ , ఎస్సీ సెల్ నగర సెక్రటరీ మనోజ్ కుమార్  తదితరులు ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు మాట్లాడారు. జనసేన నేతలు మాట్లాడుతూ… విభజించి పాలించు అనే సూత్రాన్ని బ్రిటిష్ వారి నుండి సంక్రమించినట్లు.. వైసిపి సర్కార్ రాష్ట్రంలోని ప్రధాన కులాలను విభజించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ఆరోపించారు.

స్మార్ట్ సిటీ అవార్డులు తిరుమల తిరుపతికి వచ్చిందని గొప్పలు చెప్పుకునే పాలకులు , చెత్త పన్ను వసూలు చేస్తూ ఎక్కడ అడుగుపెట్టినా చెత్త మయం చేశారన్నారు. తిరుమలలో లీటర్ నీరు 60 రూపాయల బాటిల్ చొప్పున విక్రయిస్తున్నారని, ఈ బాటల్స్ వ్యాపారం  వెనుక ఏ బడా బాబు లబ్ధి పొందుతున్నాడో…  అలాగే తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్లు  వెనుక ఎంత బడా స్కామ్ దాగి ఉందో బయటపెడతామని హెచ్చరించారు…తమ “జనసేనాని” కులమతాలకతీతంగా రాజకీయం చేయాలని పాలకులను మచిలీపట్నం సభలో హెచ్చరించారన్నారు. రాష్ట్ర ప్రజలలో మార్పు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని విన్నవించుకున్నారని , కక్ష  ,కుట్ర , కబ్జాలకు కేరాఫ్ గా ఉన్న వైకాపా ను క్షమించరాదని జనాన్ని కోరారు.

Related posts

కరోనా రోగులకు ఆహారం అందచేసిన మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్

Satyam NEWS

దీర్ఘ కాల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోస‌మే భూముల రీ స‌ర్వే

Satyam NEWS

కేంద్ర బడ్జెట్లో ఏపీకి మళ్ళీ మొండి చెయ్యి

Bhavani

Leave a Comment