మంగళవారం ముజఫర్పూర్ షెల్టర్ హోం కేసులో దోషులకు ఢిల్లీ కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో దోషులైన బ్రజేష్ ఠాకూర్తో పాటు 11 మందికి కోర్టు యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. అయితే బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలోని ఒక ఆశ్రయ గృహంలో బాలికలపై లైంగిక దాడులు, అత్యాచారాలు జరిగినట్లు నమోదైన కేసులో ఠాకూర్తో సహా 19 మందిని దోషులుగా ఢిల్లీ కోర్టు గత నెల 20న నిర్దారించిన విషయం తెలిసిందే.