అందరూ వ్యక్తిగత పరిశుభ్రత అలవాటు చేసుకోవాలని అప్పుడే కరోనా లాంటి మహమ్మారిలను సులభంగా తరిమి కొడతామని టీఆర్ఎస్ పార్టీ లీడర్ జీవన్ గౌడ్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ లీడర్ బంగారు శ్రీనివాసులు తో కలిసి ఆయన హైదరాబాద్ లోని బాగ్ అంబర్ పేట్ డివిజన్ శానిటరీ వర్కర్లకు నేడు డెటాల్ సబ్బులను పంచిపెట్టారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి వీధులను శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య పనివారి సేవలను వారు కొనియాడారు. వ్యక్తిగత శుభ్రత ఖచ్చితంగా పాటించాలని,ఇంటికి పోయిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని జీవన్ గౌడ్ బంగారు శ్రీనివాసులు వారికి చెప్పారు.