38.2 C
Hyderabad
April 29, 2024 13: 13 PM
Slider గుంటూరు

ఆరోగ్య మంత్రి విడదల రజనిని నిలదీసిన మునిసిపల్ వర్కర్లు

#vidudalarajani

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనిని మునిసిపల్ కార్మికులు నిలదీశారు. గత మూడు రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జగన్ అన్న గృహాల వివరాల గురించి తెలుసుకొనేందుకు  విచ్చేసిన మంత్రి విడదల రజిని ఈ ప్రతిఘన ఎదుర్కొన్నారు.

మున్సిపల్ కార్మిక,ఉద్యోగ సంఘాల జాయింట్ కమిటి మంత్రి రజినికి తమ నిరసన వ్యక్తం చేసిన తర్వాత వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఐ ఏరియా కార్యదర్శి నాగభైరు రామసుబ్బాయమ్మతో బాటు పలువురు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా

Related posts

కెసిఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి

Bhavani

రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి వీడియో కాన్పరెన్స్

Satyam NEWS

జాతీయ రహదారిని అభివృద్ధి చేయండి

Satyam NEWS

Leave a Comment