కాంక్రీట్ మెటీరియల్, సిమెంట్ పైపుల నాణ్యతా ప్రమాణాలను పాటించి త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం డివిజన్ పరిధిలోని అరుల్ కాలనీ, హై టెన్షన్ రోడ్డులో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులైన్ అభివృద్ధి నిర్మాణ పనులను కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష రెడ్డి, టి పి సి సి కార్యదర్శి కాప్రా సర్కిల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఎఇ తిరుమలయ్య తో కలిసి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అరుల్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఔట్లెట్ సక్రమంగా లేనందున కొద్ది రోజుల నుండి మురుగునీరు నిలిచి ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.. గత జిహెచ్ఎంసి ఎన్నికలలో చేసిన వాగ్దానాల మేరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. కాంక్రీట్ మెటెరియల్, సిమెంట్ పైపుల నాన్యత పరిమాణాలును పర్యవేక్షించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం నాయకులు మధుకర్ రెడ్డి, నాని, నాను, తదితరులు పాల్గొన్నారు.