నేటి నుండి శ్రీశైలంలో డిసెంబర్ 12 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కార్తీకమాసమంతా సామూహిక, గర్భాలయా అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేశారు. భక్తుల రద్దీ పెరుగుతుందన్న అంచనాతో సామూహిక, గర్భాలయా అభిషేకాలు నిలుపుదల చేస్తూ దేవస్థానం నిర్ణయం తీసుకున్నది. అదే విధంగా కార్తీక శని, అది, సోమ, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజులలో స్పర్శ దర్శనాలు కూడా రద్దు చేశారు. శని,ఆది,సోమ రద్దీ రోజులలో భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుంది. కార్తీకమాసం సాధారణ రోజులలో స్పర్శ దర్శనానికి 4 విడతలుగా దేవస్థానం అధికారులు అనుమతించనున్నారు.
previous post
next post