27.7 C
Hyderabad
April 30, 2024 07: 35 AM
Slider గుంటూరు

సీనియర్ జర్నలిస్ట్ ఈనాడు శరత్ మృతి బాధాకరం

#eenadusharat

నరసరావుపేట వినుకొండ నియోజకవర్గాల ఈనాడు సీనియర్ జర్నలిస్ట్ శరత్ మృతి బాధాకరమని నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. పట్టణంలోని స్థానిక బాలయ్య నగర్ నందు వారి స్వగృహం వద్ద శరత్ గారి పార్థివదేహానికి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎల్లప్పుడు ప్రజా సమస్యలను తన కలం ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి,ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఈనాడు విలేకరిగా ఆయన ప్రజల సమస్యలు తీర్చడంలో ఆయన చేసిన సేవలు మరవలేనివి అని నాకు అత్యంత ఆత్మీయుడు శరత్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని,సంతాపాన్ని తెలియజేశారు. ఆయన వెంట టిడిపి నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.

Related posts

బాబు జగ్జీవన్ రామ్ వాల్ పోష్టర్ ఆవిష్కరణ

Satyam NEWS

జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ 10 న క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ధ‌ర్నా

Satyam NEWS

అనాధ పిల్లలకు ఆసరాగా నిలిచిన సోషల్ మీడియా

Satyam NEWS

Leave a Comment