తెలంగాణ రాష్ట్రoలోఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పారు. ఈ నెలలో 2 వేల పల్లె దవాఖనాలు ప్రారంభం కానున్నాయని, హైదరాబాద్లోని బస్తీదవాఖానల మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా 2 వేల పల్లె దవాఖానలు ఏర్పాటుచేస్తామని హరీశ్రావు తెలిపారు. పేదల సంక్షేమం ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం అన్నీ వర్గాల ప్రజలకు అండ గా వుంటుందన్నారు. టిఆర్ఎస్ కు అండగా వుండాలని సంక్షేమ ఫలాలు పొందుతున్న లబ్ధిదారులను కోరారు. గజ్వేల్ లో సంజీవరావు, గీతారెడ్డి, నర్సారెడ్డి హయాంలో జరగని అభివృద్ధి, సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశానికే ఆదర్శంగా గజ్వేల్లో అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్,టీడీపీ ప్రభుత్వాలు ఇవ్వని కళ్యాణ లక్ష్మీ పథకం, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఅర్ ఇస్తుందన్నారు.
previous post
next post