29.7 C
Hyderabad
May 3, 2024 05: 59 AM
Slider కడప

వైసీపీ నేతల దాడిని ఖండిస్తూ వివిధ పార్టీల బీసీల ధర్నా

#BCleaders

అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం లో శుక్రవారం వివిధ పార్టీలు,బీసీ నేతలు ధర్నా నిర్వహించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ ఇంటి పై వైసీపీ నేతల దాడి చేసి విధ్వంసం చేయడాన్ని వారు ఖండించారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహంకు పూలమాలల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా
ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల బీసీ, యాదవ సంఘ నేతలు పాల్గొన్నారు.

ఇలాంటి దాడులు పునరావృతం అయితే భవిష్యత్తు లో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా వాటిని తిరిగి కొనసాగించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామ పక్షనేతలు చిట్వేల్ రవి, యం.యస్.రాయుడు, టీడీపీ బి.సి.నేతలు నేతలు భారతాల శ్రీధర్ యాదవ్,ఎన్టీఆర్ కేశవ,తాటి సుబ్బా రాయుడు,మిరియం వెంకటరత్నం యాదవ్, దేశ బోయిన రాము యాదవ్,మల్లెల సుబ్బరాయుడు, పిండిబోయిన కృష్ణ యాదవ్,తేజాల ఆనంద్ యాదవ్, మణిగల ఈశ్వర్ యాదవ్, మల్లెల రాజేష్ యాదవ్, మల్లెల రమేష్ యాదవ్, గోపి దాసు సుబ్రమణ్యం యాదవ్, దేవపట్ల వెంకటేష్ యాదవ్, మూరి గజేంద్ర యాదవ్ తదితర యాదవ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

వెంకన్న పేరు చెప్పి రుణాలు తీసుకుని పరారైతే…..?

Satyam NEWS

సుప్రీంకోర్టు తీర్పుపై మజ్లీస్ అధినేత అసంతృప్తి

Satyam NEWS

ప్రమాదకరంగా పుట్టిలో వారు… నదిలో పశువులు: 12 మంది అరెస్టు

Satyam NEWS

Leave a Comment