ఈ నెల 30 తేదీన జరగవలసిన ధర్నా అనివార్య కారణాలవల్ల అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసినట్లు భవన నిర్మాణ కార్మిక సిఐటియు అనుబంధ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ తెలిపారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం, మండలం లోని లక్కవరం గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సిఐటియు అనుబంధ సంఘం గ్రామ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేదీ మారిన ఈ చలో హైదరాబాద్ ధర్నాను విజయవంతం చేయాలని కార్మికులను కోరారు.కార్డు పొందిన కార్మికులు కార్డు రెన్యువల్ చేయించుకోవాలని,కార్డులు లేని కార్మికులు క్రొత్తగా వెల్ఫేర్ బోర్డు కార్డు పొందాలని,సంక్షేమ పథకాలకు ప్రతి కార్మికుడు అర్హుడు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి,భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు తమ్మిశెట్టి రాములు, ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తఫా, కోశాధికారి శీలం వేణు,గౌరవ అధ్యక్షుడు ఉప్పతల గోవిందు, శాంతయ్య, రాజేష్,శ్రీను,సల్మాన్,జక్కయ్య, సంసున్,నరేష్,అశోక్,తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, హుజూర్ నగర్