స్థానిక గుంటూరు రోడ్డు లో అమూల్య డయాగ్నోస్టిక్స్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్ ను తెలుగుదేశం పార్టీ నరసరావుపేట ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ల్యాబ్ అండ్ ఎక్సేరే టెక్నీషియన్స్ సభ్యులు APPSA అండ్ APJMA గుంటూరు జిల్లా అధ్యక్షులు కొల్లి బ్రహ్మయ్య, అఖిల భారత వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లెపు నాగేశ్వరరావు, సమైఖ్య ఆంధ్రప్రదేశ్ ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ యస్ కె. జిలానిమాలిక్, ఎపి ప్రవేట్ స్కూల్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు చిరుమామిళ్ల రాము, డాక్టర్. దేవరకొండ మాదవిలత, వేములూరి బాల కృష్ణ చారి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ అరవింద్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మన ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు చేయిం చుకోవలని సూచించారు ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభించడంతో ప్రతి ఒక్కరు ఇండ్ల లోనే ఉండి వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ పొష్టిక ఆహారం తీసుకోవాలని కోరారు.
అత్యంత అవసరమైనప్పుడు మాత్రమే బయటికి వచ్చి మీ పనులు చేసుకోవాలని సూచించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, డాక్టర్ల సలహాలు సూచనలు తీసుకోవాలని కోరారు.