30.7 C
Hyderabad
April 29, 2024 06: 10 AM
Slider ప్రకాశం

దళిత మంత్రి సురేష్ ఇలాకా లో దళితులపై వివక్ష

#protest for drinking water

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం నాయుడుపాలెం గ్రామం దళిత కాలనీవాసులు త్రాగునీటి కోసం నిరసన ప్రదర్శన చేశారు. పుల్లలచెరువు మండలం త్రాగునీటి సమస్య తీర్చేందుకు ముటుకుల వద్ద సాగర్ నీటి జలాల నుండి సమ్మర్ స్టోరేజీ నిర్మించారు. అయితే త్రాగునీరు గ్రామాలకు సరఫరా కావట్లేదు. దాంతో ఈ మధ్యకాలంలో గ్రామాలలో నీటి సమస్య గురించి నిరసనలు తెలియచేస్తూనే ఉన్నారు.

త్రాగు నీటి గురించి మంత్రి అధికారులతో సమీక్షించారు. ప్రతి గ్రామానికి త్రాగునీరు సరఫరా చేయాలని అధికారులకు సర్పంచులకు ఆదేశాలు జారీ చేశారు. పిరికిటివానిపల్లి పంచాయతీ నుండి నాయుడు పాలెం గ్రామం అగ్రకులాలు నివసించే ఆ ప్రాంతానికి త్రాగునీరు సరఫరా చేశారు. దళిత కాలనీలో సుమారు 300 కుటుంబాలు నివసిస్తున్నారు. దళితులపై ఇంత వివక్ష ఎందుకని కాలనీవాసులు ఆవేశంతో నిరసన తెలిశారు. తమ సమస్యను పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు.

Related posts

నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత ఘన విజయం

Satyam NEWS

చిత్తు చిత్తుగా ఓడిపోయిన వైసీపీ ధనబలం

Satyam NEWS

ఈ నెల 7న ” కీచ‌క సంహారం – నారీ నీరాజ‌నం ”

Satyam NEWS

Leave a Comment