29.7 C
Hyderabad
April 29, 2024 08: 38 AM
Slider ముఖ్యంశాలు

పోలీస్ అమరుల కుటుంబాలకు పట్టాలు పంపిణీ

#police martyrs

ఖమ్మం జిల్లాలో విధి నిర్వహణలో భాగంగా వివిధ ఎన్కౌంటర్లు, బాంబ్ బ్లాస్టింగ్ దుర్ఘటనలో అసువులు బాసిన 20 మంది పోలీస్ కుటుంబాలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక కృషి మేరకు మంజూరైన ఇళ్ళ పట్టాలను ఆయా 20

మంది కుటుంబ సభ్యులకు రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదగా పట్టాలను పంపిణీ చేశారు.గత 19ఏళ్ళుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న పోలీస్ అమరుల కుటుంబాల గోస

ను అనేక మార్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.స్పందించి మంత్రి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయా కుటుంబాలకు పట్టాల ద్వారా శాశ్వత పరిష్కారం చూపించారు.

తమ చిరకాల స్వప్నం నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఅర్ , మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిత్రపటానికి అమరుల కుటుంబ సభ్యులు క్షీరాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేశారు.పంపిణీ చేసిన వారిలో ఎమ్మెల్సీ తాతా మధు ల,

ఎంపి వద్దిరాజు రవిచంద్ర, మేయర్ పునుకొల్లు నీరజ , సుడా చైర్మన్ విజయ్, జిల్లా కలెక్టర్ గౌతమ్ , పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ గారు, అదనపు డీసీపీ సుభాష్ చంద్ర బోస్ గారు తదితరులు ఉన్నారు.

Related posts

అపహాస్యం అవుతున్న నిపుణుల నివేదిక

Satyam NEWS

కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన కొల్లాపూర్ ఎంఎల్ఏ

Satyam NEWS

ఓటు వేయడానికి కాలినడన గిరిజన ఓటర్లు…!

Satyam NEWS

Leave a Comment