కాకతీయ యూనివర్సిటీ గణితశాస్త్రం పరిశోధకురాలుగా గౌరవేణి సరితకు డాక్టరేట్ లభించింది. ఈ మేరకు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ పీ.మల్లారెడ్డి సరితకు డాక్టరేట్ ప్రకటించినట్లు తెలిపారు. మార్కోవ్ ప్రొసెస్ ఇన్ రిలియాబిలిటీ మోడల్స్ – ఫర్ పార్ మెన్స్ స్టడీ అనే అంశంపై కేయూ గణితశాస్త్ర విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ యం. తిరుమలాదేవి పర్యవేక్షణలో సరిత పరిశోధన పూర్తి చేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట ( రామప్ప) గ్రామానికి చెందిన సరిత ఆదివాసి కులంలో జన్మించి నేషనల్ పెలోపిష్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎస్టీ స్టూడెంట్ నుండి ఫెలోఫిష్ అందుకున్నారు. డాక్టరేట్ లభించిన సరిత ను అధ్యాపకులు పరిశోధన చేసిన విద్యార్థులు, బంధువులు అభినందించారు.