సిబిఐటి కళాశాల సిఎస్ఇ విభాగంలో మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ కె స్పందన , ఉస్మానియా విశ్వవిద్యాలయం సి ఎస్ ఇ విభాగం నుండి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీ పొందినందుకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి వి నరసింహులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్పందన మాట్లాడుతూ ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ సాంకేతిక ద్వారా వ్యవసాయ రంగంలో ఏ విధంగా ఉపయోగబడుతుంది అనే అంశం పై పరిశోధన చేసినట్టు తెలిపారు. మట్టిని విశ్లేషించడానికి అనేకమైన సహజ పద్దతులు ఉన్నపటికీ, సాంకేతిక విజ్ఞానం ఉపయోగించి తక్కువ సమయం లో మట్టిలోని పోషకాలను ఎలా కనుగొనవచ్చో మరియు పోషకాల పరిమాణాన్ని బట్టి ఏ పంటను వేయాలో వివరించారు. నిజామామాబాద్ జిల్లా, సిరికొండ మండలం లో నవ్యనంది గ్రామా మట్టి నమూనాలను సేకరించి ఆ గ్రామంలో మట్టి పోషకాలు ఎలా ఉన్నాయో కనుగొన్నాం అని తెలిపారు . ఈ థీసిస్కు సిబిఐటి – ఎఇసి డైరెక్టర్ ప్రొఫెసర్ పబ్బోజీ సురేశ్ మార్గనిర్దేశం చేశారు. సిఎస్ఇ విభాధిపతి ప్రొఫెసర్ డి రామణ్ , ప్రొఫెసర్ వై రామ దేవి, ఎన్ రామ దేవి, ప్రొఫెసర్ ఎస్ చిన్న రాము , ప్రొఫెసర్ ఎమ్ స్వామి దాస్, కళాశాల పి ఆర్ ఓ డాక్టర్ జిఎన్ఆర్ ప్రసాద్ అభినందనలు తెలిపారు.
previous post
next post