కడప జిల్లా రాజంపేటలో కోవిడ్ -19 లాక్ డౌన్ లో పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసేందు కు గురువారం రాత్రి రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి కి రాజంపేట ఐ.ఎం.ఎ డాక్టర్స్ అసోసియేషన్ లక్ష రూపాయలు అందజేశారు. బోయిన పల్లె లోని మేడా భవన్ లో ఎమ్మెల్యే ని ఐ.ఎం.ఎ ప్రెసిడెంట్స్ డాక్టర్ జయభస్కర్ రావు, డాక్టర్ బాలరాజు, సెక్రటరీ డాక్టర్ అనీల్ కుమార్, ట్రెజర్ డాక్టర్ మధుసూధన్ తదితర ప్రభుత్వ, ప్రవేటు డాక్టర్లు కలిసి లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వైద్యులను ఎమ్మెల్యే అభినందించారు.
previous post