సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న శ్రీ శీతలాపరమేశ్వరి (బొడ్రాయి)శ్రీ శంభులింగేశ్వర స్వామి కీర్తి ధ్వజ,శిఖర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో ఆదివారం శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
వేద పండితుల మంత్రోచ్ఛారణలతో నిర్వహించిన ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.