తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 74 వ వర్థంతిని జిల్లెల్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లెల సర్పంచ్ ఎముకల జంగయ్య మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య ఆశయాలను కోనియడుతూ యువత దొడ్డి కొమురయ్య ను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి అన్నారు.
బీసీ సంఘం నాయకులు దొడ్డి కొమురయ్య జయంతి, వర్థంతి కార్యక్రమాలు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు ఎముక జంగయ్య , ఎంపిటిసి శోభ శేఖర్ రెడ్డి ,ఉప సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు జిల్లా గుమ్మకోండ రాజు పాల్గొన్నారు.
ఇంకా, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్దయ్య యాదవ్ ,బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ తాలుక అధ్యక్షులు రాజేందర్ , ప్రధాన కార్యదర్శి గోపాల్ , జేఏసీ చైర్మన్ సదనంద్ గౌడ్ ,మాజి ఉప సర్పంచ్ పాండు గౌడ్ . విగ్రహ కమిటి రాష్ట్ర అధ్యక్షుడు నాప శ్రీకాంత్ నాయకులు అనంద్,బిక్షపతి కురుమ, రామకృష్ణ కురుమ,మహేష్ కురుమ,రమేష్ కురుమ, భరత్,శ్రీహరి,శివ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.