నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం జల్లా పల్లి ఫారంలో గురువారం బాన్సువాడ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పోచారం సురెంధర్ రెడ్డి గ్రామంలో నూతనంగా మంజూరైన 35 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఓ లబ్దిదారుని ఇంటివద్ద భూమిపూజ చేస్తున్న సందర్భంలో ఆ ఇంటి పక్కనే శిథిలావస్తలో ఉన్న పూరిగుడిసెను చూసి ఇది ఎవరి ఇల్లు అని స్తానిక నాయకులను అడిగారు.
ఇది ఇప్పుడు భూమి పూజ చేస్తున్న వ్యక్తి తమ్ముడి ఇళ్లని నాయకులు చెప్పగా ఆ ఇంటి పరిస్థితిని చూసి వెంటనే అతనికి కూడా మరో ఇల్లు ఇవ్వాలని నాయకులకు స్పష్టం చేశారు.ఆ ఇంటి వెనుక ఉన్న మరో పూరి గుడిసెను చూసి వారికి కూడా ఇల్లు ఇవ్వాలని వెంటనే వీరిద్దరికి ఇండ్లు కేటాయించాలని స్తానిక నాయకులకు తెలిపారు.
వీరిద్దరి అన్నలకు ప్రస్తుతం డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నామని మరో విడతలో వీరికి ఇవ్వాలనుకున్నట్టు స్తానిక నాయకులు చెప్పగా వారి పరిస్థితి దారుణంగా ఉందని చూస్తేనే అర్థమౌతుందని వారికి వెంటనే రెండు ఇండ్లు కేటాయించాలని నాయకులకు సూచించారు. దీంతో పూరి గుడిసెలో నివాసముంటున్నవారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
సురేందర్ రెడ్డిని పట్టుకుని ఆనంద భాష్పాలు రాల్చిన లబ్దిదారులు ఆయనతో సెల్ఫీదిగి ఈరోజును జీవితంలో మర్చిపోమని ఆయనతో చెప్పారు.
పక్కింటి భూమిపూజకొచ్చి తమ సొంతింటి కలను నెరవేర్చిన సురేందర్ రెడ్డికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.