సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్స్ పంపిణీలో అవకతవకలు జరిగాయి అంటూ గ్రామపంచాయతీకి తాళం వేసి ముళ్లకంచే అడ్డుగా వేసి ఆందోళన చేపట్టారు, గ్రామంలో ఇల్లు పొలాలు ఉన్నవారికి డబల్ బెడ్రూమ్స్ ఇల్లులు ఎంపికలో ఎలా వచ్చాయి అన్నారు, సర్వే నిర్వహించిన అధికారులకు భారీగా డబ్బులు ముట్టినాయని అన్నారు, ఆకు పాముల గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్స్ ఎంపిక అధికారులు కోదాడలో పోలీసుల పహారాలో సీక్రెట్ గా నిర్వహించడంపై పలు అనుమానాలకు దారితీసిందని అన్నారు, ఇప్పటికైనా నాయకులు అధికారులు నిద్రమత్తు వదిలి రీ సర్వే చేసి అర్హులకు ఇల్లు కేటాయించాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
previous post
next post