కరోనా వైరస్ కట్టడిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న డ్రైనేజీ శుద్ధి కార్మికులకు నారాయణగూడలోని గాంధీకుటీర్ లో ఘన సన్మానం జరిగింది. గాంధీకుటీర్ ఉపాధ్యక్షుడు, చేతన ఫౌండేషన్ అధ్యక్షుడు కేషబోయిన శ్రీధర్ పలువురి కార్మికులకు పూల దండలు వేసి శాలువాలతో అభినందించారు.
డ్రైనేజీ శుద్ది చేయాలని కోరిన వెంటనే స్పందించిన సిబ్బంది బస్తీకి వచ్చి డ్రైనేజీలోని చెత్తా చెదారాన్ని తొలగిస్తున్నారని ఇది ఎంతో గొప్ప విషయమని ఆయన అన్నారు. కరోనా కట్టడికి కార్మికులు చేస్తున్న పనిని ప్రోత్సహిస్తూ అభినందనలు తెలిపారు.