హైదరాబాద్ లోని అంబర్ పేట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న గోల్నాకా డివిజన్ కు సంబంధించిన డ్రైనేజి పైప్ లైన్ పనుల ఆధునీకరణపై ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జైస్వల్ గార్డెన్ నుంచి డీ మార్ట్ వరకు ఉన్న డ్రైనేజీ, వర్షం నీటి పైప్ లైన్ లను వేరు చేయాలని జలమండలి అధికారులకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సూచించారు.
శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో జలమండలి జీఎం సంతోష్, డిజిఎం సతీష్, GHMC EE ఆశాలత, ae లతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. గోల్నాకా డివిజన్ పరిధిలోని జైస్వాల్ గార్డెన్, మారుతినగర్ లలో కొత్త మంచినీటి పైప్ లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే తెలిపారు.