వైసీపీ సర్కార్పై నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీది రాక్షస పాలన.. వైసీపీ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హిందూపురంలో పర్యటిస్తున్న బాలయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఆలయాలపై దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశానికి అన్నంపెట్టే రైతన్నను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతాయన్నారు.