వేసవి కాలంలో పల్లెలు దాహంతో అలమటిస్తున్నాయని, తాగేందుకు నీరు లేకుండా పోయిందని సర్పంచ్ లు వాపోతున్నారు. నిర్మల్ జిల్లా బాసర మండలంలోని సర్పంచ్ లు ఈ మేరకు ఎంపిడిఓ కు నేడు వినతిపత్రం సమర్పించారు.
మండలంలోని చాలా గ్రామాలు నీటి ఎద్దడిని ఎదుర్కుంటున్నాయని అందువల్ల తక్షణమే తాగు నీరు అందించాలని ప్రజాప్రతినిధులు కోరారు. గ్రామాల్లో మీషన్ భగీరథ ద్వారా గ్రామస్తులకు మంచినీరు అందించి సమస్య తీర్చాలని ఎంపిడిఓ ను మండల సర్పంచ్ లు కోరారు.