అంబర్ పేట్ డివిజన్ బాపునగర్ కింగ్ ప్యాలెస్ గల్లీలో, కాకతీయ లైన్లో జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్పేట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎండాకాలంను దృష్టిలో ఉంచుకొని నల్ల నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా ఉండటానికి, డివిజన్ లోని బాపునగర్, కాకతీయ లైన్ లో ఇంటింటికి తిరుగుతూ మంచినీటి సరఫరా నీ పరిశీలించి, వేసవి కాలం అయినప్పటికీ నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తనకు తెలియజేయాలని స్థానికులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు మహమ్మద్ యూసుఫ్,సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట