విద్య లనగరమైన విజయనగరం జిల్లాలో పోలీసు బాస్ ఆదేశాలతో అన్ని పోలీసు స్టేషన్ ల సిబ్బంది ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ల సూచనలతో డ్రంక్ అండ్ డ్రైవ్ పై దృష్టి పెట్టారు. ఏక కాలంలో నాకా బంధీలా రోడ్ల వెళుతున్న బైక్స్ ను అక్కడికక్కడే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమంలో గరివిడి, డెంకాడ ,రామభద్రపురం స్టేషన్ ల ఎస్ఐలు లీలావతి, కృష్ణ మూర్తి,.తలో స్టేషన్ ఎస్ఐలు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.ఇలా జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది తమ పరిధిలోని ముఖ్య కూడళ్లలో వాహన తనిఖీలు చేపట్టి, రికార్డులు పరిశీలించి, డ్రంకన్ డ్రైవ్ నిర్వహించి, నిబంధనలు అతిక్రమించిన వారిపై ఈ చలానాలు విధించారు.