విజయనగరం జిల్లాలో వికలాంగులకు పించన్ సకాలంలో ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆరోపించింది..ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం . అలాగే పించన్ల సొమ్మును 2 వేల నుంచీ మూడు వేలకు ఫెంచుతామని హామీ ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు పెంచలేదంటూ జిల్లా కేంద్రమైన విజయనగరం ఎంపీడీఓ ఆఫీసు సమీపంలో నిరసన నిర్వహించింది.అనంతరం టీడీపీ రాష్ట్ర నేత ఐవీపీ రాజు నేతృత్వంలో పార్టీ నేతుల విజ్జపు ప్రసాద్, కనకల మోహన్ రావులు ఎంపీడీఓకు వినతిపత్రం అందచేసారు.ఈ సందర్భంగా పార్టీ నేత ఐవీపీరాజు మాట్లాడుతూ…పేద వాళ్లు ఉచితంగా విద్య,వైద్య వృద్దులకు పించన్లు ఇవ్వాలన్నారు.కానీ ఫించన్లు పెంచేది లేకుండా..మందులకు రేటుశర వేగంగా పెరుగుతోందన్నారు.పథకాలు తీయకుండా..కోతలు పెట్టి వికలాంగులకు ఫించన్లుకట్ చేయడం దారుణన్నారు.వికలాంగులకు పించన్లు కట్ చేస్తే..తరువాత జన్మలో వికలాంగ జన్మ ఎత్తక తప్పదని ఐవీపీ రాజు హెచ్చరించారు.ఎండననక,వాననక వికాలంగులు దర్నాలు చేస్తుంటూ ఒక్క అధికారి వారి బాధలను వినటం లేదని కసీనం డీఎంఅండ్ హెచ్ ఓ స్పందించాలని తదుపరి ఆ శాఖ ఉన్నతాధికారిని కలుస్తామని టీడీపీ నేత ఐవీపీ రాజు హెచ్చరించారు.
previous post