39.2 C
Hyderabad
April 28, 2024 11: 44 AM
Slider నల్గొండ

మేళ్ళచెరువు మండల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా

#uttamkumarreddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండల  పరిషత్ సర్వసభ్య సమావేశానికి గురువారం నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరై ప్రసంగించారు. మండల స్థాయి అధికారులు, ఎన్నికైన సర్పంచ్‌లు,ఎంపీటీసీలతో దాదాపు 2 గంటల పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు.

ఈ సందర్భంగా కెప్టెన్ ఉత్తమ్ మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా మేళ్ళచెరువు గ్రామం,మండలంలో రోడ్లు,రైల్వే లైన్,విద్య,వైద్య,విద్యుత్ సౌకర్యాలు,ఇండ్ల నిర్మాణంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని ఈ విధంగానే మున్ముందు కూడా మేళ్ళచెరువు గ్రామ,మండల అభివృద్ధి విషయంలో సర్వశక్తులా పనిచేస్తానని పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ హామీ ఇచ్చారు. నా దృష్టికి తెచ్చిన సమస్యలు అన్నింటినీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

విలువల అనుసరణే వావిలాలకు మనమిచ్చే ఘన నివాళి

Satyam NEWS

దగా పడ్డ రైతుకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే

Bhavani

హేట్రెడ్: కాశ్మీర్ లో బలవంతంగా లాక్ డౌన్ విధించారు

Satyam NEWS

Leave a Comment