ప్రభుత్వ కార్యాలయాలలో సమర్ధవంతమైన, కచ్చితమైన సేవలు అందించడానికి ఇ-ఆఫీసును ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సెక్రటేరియట్ లోని 8 శాఖలలో, HoD లలో 2 శాఖలలో ఇ -ఆఫీసును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఇ -ఆఫీసు ద్వారా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, వేగంగా ప్రాసెస్ చేయడానికి వీలు కలుగుతుందన్నారు. ఎక్కడ నుండైన పని చేయడానికి వీలుకలుగడంతోపాటు, సమర్దవంతమైన పాలనను అందించవచ్చన్నారు.
సెక్రటేరియట్ లోని వైద్య, ఆరోగ్య శాఖ, ప్లానింగ్ , కార్మిక శాఖ, బిసి సంక్షేమం, షెడ్యూల్డ్ కూలాల అభివృద్ధి శాఖ , మైనారిటీ సంక్షేమం, గిరిజన సంక్షేమం, హోంశాఖలతో పాటు , పి.సి.బి. వ్యవసాయ శాఖ కమీషనర్ కార్యాలయాలలో ఇ -ఆఫీసును ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సెక్రటేరియట్ లో 15 శాఖలలో ఇ -ఆఫీసును అమలుచేస్తున్నామన్నారు.
మిగిలిన శాఖలలో e-ఆఫీస్ అమలును వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ స్పెషల్ సి.యస్ రాణి కుముదిని, ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ , హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, పి.సి.బి. మెంబర్ సెక్రటరి నీతూ కుమారి ప్రసాద్ , ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరి రోనాల్డ్ రోస్, షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ స్పెషల్ సెక్రటరి విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.