సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం ఈ శ్రమ్ కార్డు రిజిస్ట్రేషన్ కార్యక్రమం వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న అసంఘటిత కార్మికులు,వలస కూలీలు అందరికీ వివిధ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం ఒక సమగ్ర ఈ శ్రమ్ పోర్టల్ రూపోందించారని,అసంఘటిత కార్మికుల గుర్తింపు కార్డు కోరకు టైలర్స్,బార్బర్లు,డ్రస్ మేకర్లు,వడ్రంగులు,ఆటో డ్రైవర్లు,రైతు కూలీలు,ఇటుక బట్టి కార్మికులు,ఎలక్ట్రికల్ వర్కర్లు, వివిధ వృత్తుల వారు అప్లై చేసుకోవచ్చు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం మేనేజర్ యాకుబ్ పాషా,మెప్మా సిబ్బంది మంద కనకదుర్గా, గోలి రాజేశ్వరి, తోటకూర సుజాత,నందిగామ పాపయ్య, ఇందిరాల నాగమణి,వీధి విక్రయదారులు రాపోలు శ్రీనివాసు,కొండలరావు, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్