రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కొండాయిలో భారీ వర్షాల కారణంగా అక్కడి ప్రాంత వాసులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టారు.
బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంతోపాటు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, త్రాగునీరు, హెలికాప్టర్ ద్వారా అందిస్తున్నారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేసి ప్రజలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందిస్తున్నారు. ఎవరు ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను కాపాడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు