తిరుపతి జిల్లా, వెంకటగిరి బార్ అసోసియేషన్ కు ఈరోజు జరిగిన ఎన్నికల్లో… వెంకటగిరి పట్టణం కర్ణ కమ్మ వీధికి చెందిన ప్రముఖ మహిళా సీనియర్ న్యాయవాది గిరిజా కుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా గాంధీ, ప్రధాన కార్యదర్శిగా పెట్లూరు గురు ప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా దామా గురు ప్రసాద్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు కుమారికి అదేవిధంగా గెలుపొందిన సీనియర్ న్యాయవాదులు గాంధీ, పెట్లూరు రామ్ ప్రసాద్, దామా గురు ప్రసాద్ లకు బార్ అసోసియేషన్ కు చెందిన చెందిన న్యాయవాదులు, రాజకీయ నాయకులు మరియు పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపారు.
కొంగ రమాకాంత్, సీనియర్ జర్నలిస్ట్