దళితులకు మూడెకరాల భూమి కేటాయింపులో సిఎం కేసీఆర్ ఫ్రభుత్వం దళితులను మోసం చేస్తోందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీజెపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు నాంపల్లి రూపాసుధాకర్రెడ్డి అన్నారు. బుధవారం నాంపల్లి రూపాసుధాకర్రెడ్డి , బిజేపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వాసు ఆధ్వర్యంలో హుజూరాబాద్ లోని బూత్ నెంబర్ 33, 34 లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్బంగా రూపాసుధాకర్రెడ్డి ఇంటింటికి తిరుగుతూ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి ఈటల రాజేందర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్దిస్తూ ప్రచారం చేసారు. ఈ సందర్బంగా రూపాసుధాకర్రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని, దళితుడిని సిఎం ని చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి కేటాయింపులో సిఎం కేసీఆర్ ప్రభుత్వం దళితులను మోసం చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో వెను, పద్మజారెడ్డి, నవీన్ ,ప్రవీన్ తదితరులు పాల్గొన్నారు.