42.2 C
Hyderabad
April 26, 2024 17: 46 PM
Slider రంగారెడ్డి

దళితులకు మూడెకరాలు భూమి కేటాయింపులో మోసం చేస్తున్న కేసీఆర్‌

#bjpmedchal

దళితులకు మూడెకరాల భూమి కేటాయింపులో సిఎం  కేసీఆర్‌ ఫ్రభుత్వం దళితులను మోసం చేస్తోందని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బీజెపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు నాంపల్లి రూపాసుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం నాంపల్లి రూపాసుధాకర్‌రెడ్డి , బిజేపి స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ వాసు  ఆధ్వర్యంలో హుజూరాబాద్‌ లోని బూత్‌ నెంబర్‌ 33, 34 లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్బంగా రూపాసుధాకర్‌రెడ్డి ఇంటింటికి తిరుగుతూ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి ఈటల రాజేందర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్దిస్తూ ప్రచారం చేసారు. ఈ సందర్బంగా రూపాసుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని, దళితుడిని సిఎం ని చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి కేటాయింపులో సిఎం  కేసీఆర్‌ ప్రభుత్వం దళితులను మోసం చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో వెను, పద్మజారెడ్డి, నవీన్‌ ,ప్రవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వాలంటైన్ గాడ్ని రానివ్వని విశాఖ పోలీసులు

Satyam NEWS

సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిని కొనసాగించాలి

Satyam NEWS

అధ్వాన్నపు రోడ్లు: అధికార పార్టీ ప్రజాప్రతినిధి మృతి

Satyam NEWS

Leave a Comment