వీర తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఓటరులారా బానిసత్వం నుంచి మీ కాల్మొక్కుత దొర అనే ఈ ప్రాంతంలో దొర ఏందిరో దొర పీకుడేందిరో అనే స్థాయికి తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా బానిసత్వ విముక్తి చేసిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉందని, ఆ కమ్యూనిస్టు బలపరిచిన MLC గా పోటీ చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ విజయసారధి రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరోసారి తెలంగాణ బిడ్డలా గర్వపడేలా చేయాలని నిరుద్యోగులను, ఉద్యోగులను జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కోరారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టీచర్స్ కాలనీ, శీతారాంనగర్, దద్దనాలచెరువు, ప్రాంతంలో ఎమ్మెల్సీ ఓట్ల ప్రచారంలో భాగంగా తిరుగుతూ రోషపతి మాట్లాడుతూ ఈనెల 14వ, తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రంలో 71 మంది పోటీలో ఉన్నారని, వరుస సంఖ్య రెండోవారైన జయసారధిరెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈకార్యక్రమంలో సిపిఎం నాయకులు జక్కుల వెంకటేశ్వర్లు, ఛిన్నం వీరమల్లు, రాములు, అహ్మద్, బాబా, లక్ష్మిమల్ల నరసింహారావు, సైదులు తదితరులు పాల్గొన్నారు.