ఆకస్మికంగా మరణించిన బ్యాంకు సిబ్బంది కుటుంబానికి సిబ్బంది యూనియన్ ఆర్ధిక సాయం అందించి ఆదర్శంగా నిలిచింది. ది నిజమాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ బిచ్కుంద శాఖలో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహించిన S.గంగారాం ఆకస్మికంగీ మరణించారు. బ్యాంక్ యూనియన్ తరపున బ్యాంక్ సిబ్బంది ఒక రోజు వేతనం మొత్తం రూ.5,25,896/- చెక్కును గంగారాం కుటుంబ సభ్యులకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అందచేశారు.
అదే విధంగా బాన్సువాడ శాఖలో అటెండార్ గా విధులు నిర్వహించిన MD.మహమూద్ మరణించారు. బ్యాంక్ యూనియన్ తరపున బ్యాంక్ సిబ్బంది ఒక రోజు వేతనం రూ. 5,83,405/- మహమూద్ కుటుంబ సభ్యులకు చెక్కులను అందచేశారు. ఈ సందర్బంగా ఛైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి మరణించిన కుటుంబ సభ్యులకు తన వంతుగా ఒక్కొక్కరికి ఆర్థిక సహాయంగా 25000/- నగదును అందచేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మెన్ మార గంగా రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్స్ కిష్ట గౌడ్,సిద్ది రాములు,శ్రీనివాస్ రెడ్డి, సాయి కుమార్, రామ్ పటేల్,సాయి రెడ్డి, శాంతిస్వర్ పటేల్, సంగ్రాం నాయక్,శరత్,శేఖర్ రెడ్డి,చంద్ర శేఖర్ రెడ్డి,లింగయ్య,మోతీలాల్,భూషణ్ రెడ్డి, సీఈఓ గజానంద్,యూనియన్ నాయకులు సందీప్ శర్మ,శ్రావణ పాల్గొన్నారు.
జి. లాలయ్య సత్యం న్యూస్, జుక్కల్ నియోజకవర్గం