కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళ వారం ఉదయం శివ ధనుర్భాలంకారంలో స్వామి దర్శనమిచ్చారు. ఈ రోజు ఆలయ ప్రాంగణం లోని కల్యాణ మండపంలో రాత్రి 7 నుండి 9 గంటల వరకు సీతా సమేత కోదండ రామస్వామి కల్యాణం ను ఏకాంతంగా కల్యాణం నిర్వహించనున్నారు.
పంచవ్యాప్తంగా ఉన్న భక్తులు రాములవారి కల్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర శాఖ కమిషనర్ మువ్వ పద్మా ఆదేశాలు జారీ చేశారు. రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు మేడా వేంకటమల్లిఖార్జున రెడ్డి ప్రజలందరి కీ ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం శుభాకాంక్షలు తెలిపారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో అందరూ ఇంటి వద్దనే ఉండి, టీవీల్లో కల్యాణం లైవ్ లో చూసి తరించాలని కోరారు.