ఎపి డిజిపి గౌతం సవాంగ్ ను కలవాలంటే హిందువులు నుదుటిపై బొట్టును చెరుపుకోవలసి వస్తున్నదన్న శివస్వామి ఆరోపణలపై విచారణ జరపాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం శివక్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఒక టివి ఛానల్లో మాట్లాడుతూ తాను తన వారితో కలసి ఇటీవల డిజిపిని కలవడానికి వెళ్ళినప్పుడు ఈ విషయం అక్కడి కానిస్టేబుళ్లు చెప్పారని తెలిపారు.
డిజిపి కార్యాలయంలయంలో 90 శాతం హిందూయేతరులే వున్నారని, హిందువులు నుదుటి మీద బొట్టు పెట్టుకుని వెళ్ళితే సమయం దొరకదని వారు తెలిపారని స్వామి చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్, హోమ్ శాఖా మంత్రి, డిజిపి ఒకే మతానికి చెందిన వారైనందున ఈ పరిస్థితి వచ్చిందని సాధారణ ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు.
అందుకే హిందూ ఆలయాలు, విగ్రహాలపై అనేక దాడులు జరుగుతున్నా ప్రభుత్వం, పోలీసులు పట్టించు కోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. శివస్వామి ఆరోపణలపై ట్విట్టర్లో పోస్టింగ్ పెద్దినందుకు చిత్తూరు జిల్లా ధర్మ జాగరణ సమితి అధ్యక్షుడు ఎం. సతీష్ రెడ్డి పెనుమూరు పోలీసులు బెదిరిస్తున్నారు. ఆయనపై కేసులు పెట్టి వేధించే ప్రమాదం ఉంది. ఈ నేపధ్యంలో దీనిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి.