ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారి కి వ్యాక్సిన్ రావడం, అదీ మన దేశంలో రూపుదిద్దుకోవడంపై కనకదుర్గ అమ్మవారికి మోడీ యువసేన కన్వీనర్ నాగలింగం శివాజీ వ్యక్తిగతంగా ముక్కులు చెల్లించుకున్నారు.
నేడు ఆయన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం గోశాల ప్రక్కన ఉన్న మెట్ల మార్గం నుండి మోకాళ్ళపై మెట్లెక్కుతూ అమ్మవారి మెట్ల పూజ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశారు.
ఆయనతో పాటు విజయవాడ సత్యనారాయణపురం కు చెందిన మహిళలు భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని పసుపు కుంకుమ తో మెట్లను అలంకరించారు.
ఈ సందర్భంగా నాగలింగం శివాజీ మాట్లాడుతూ కరోనాకు వ్యాక్సిన్ రావాలని, కరోనా పూర్తిగా తగ్గి పోవాలని అలా జరిగితే మెట్ల పూజ చేస్తానని మొక్కుకున్నానని, ఇప్పుడు ఆ స్థితి వచ్చినందున మొక్కు తీర్చుకున్నానని చెప్పారు.
ఆ చల్లని తల్లి దీవెనలతో మనదేశంలో వ్యాక్సిన్ తయారవడం అది ప్రపంచ దేశాలకి ఎగుమతి చేయడం అనేది ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఒక ఉన్నతమైన స్థానం కల్పించిందని ఆయన అన్నారు.
ఈరోజు ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్ కోసం భారతదేశం వైపు చూడటం చాలా గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టితోనే ఇది సాధ్యం అయిందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో శివాజీ నాగలింగం తో పాటు కర్రీ నాగలక్ష్మి దుర్గాప్రసాద్ కనకదుర్గ భక్త బృందం సత్యనారాయణపురం సేవా సమితి సభ్యులు హిందూ యువసేన సభ్యులు హిందూ బంధువులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన కార్యనిర్వాహణ అధికారికి ఆలయ సిబ్బందికి, మీడియా మిత్రులకు శివాజీ ధన్యవాదాలు తెలియజేశారు.