40.2 C
Hyderabad
April 26, 2024 11: 24 AM
Slider హైదరాబాద్

లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడవద్దు

#AmberpetMLA

నిత్యావసర వస్తువుల కోసం ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో తాము అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అంబర్ పేట్ నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. గోల్నాక డివిజన్ కార్పొరేటర్ కాలేరు పద్మా వెంకటేష్ ఆధ్వర్యంలో నేడు ఆయన గోల్నాక డివిజన్లలోని క్వారంటైన్ లో ఉన్న గంగానగర్ బస్తీ ప్రజలుకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ వల్ల పనిలేక ఇంటికే పరిమితం కావడం వల్ల బస్తీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు మేరకు వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి అధికారులు, టీఆర్ఎస్ నాయకులు వార్డు సభ్యులు దోర్నాల భరత్రాజ్ ముదిరాజ్, లక్ష్మణ్, కన్న రామ్, ఆర్. కె. బాబు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

తక్షణమే ముఖ్యమంత్రి పదవిని వికేంద్రీకరించాలి

Satyam NEWS

మున్సిపల్ కార్మికులపై కనికరం చూపండి మహాప్రభో

Satyam NEWS

కళ్యాణలక్ష్మి చెక్కుతో పాటు చీర పంపిణీ

Satyam NEWS

Leave a Comment