కరోనా కాలంలో కూడా కెసిఆర్ కి కనికరం లేకుండా పోయిందని, 11వ, పిఆర్సి ప్రకటించుతుందనుకున్న మున్సిపల్ కార్మికులకి,పర్మినెంట్ ఉద్యోగులకు నిరాశే మిగిలిందని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మునిసిపల్ ఇన్చార్జి కమిషనర్ ఎస్ కె యాకూబ్ పాషా వినతి పత్రం ఇచ్చిన అనంతరం సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు రోషపతి మాట్లాడుతూ పదకొండవ పిఆర్సి ప్రకటించే వరకు మున్సిపల్ కార్మికులకు నెలకి 24 వేల రూపాయలు వేతనం ఇవ్వాలని, సంవత్సరానికి క్యాజువల్ సెలవు దినాలు 15 రోజులు ఇవ్వాలని అన్నారు.
ఈనాడు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ఆకాశాన్ని తాకుతున్నాయని వారికి వేతనాలు వెంటనే పెంచాలని కోరారు. అధికారుల వేధింపులు కార్మికులపై పెరుగుతున్నాయని ఆరోపించారు. అర్హత కలిగిన కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ గృహాలను ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో లో జిల్లా నాయకుడు యల్క సోమయ్య గౌడ్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు, కార్యదర్శి, కష్టాల ముత్తమ్మ మేరిగ దుర్గారావు, కుమారి, సైదులు, పుల్లయ్య, శ్రీను, గోపి, వెంకటరమణ, చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.